సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు ఖైదీలు పరారైన ఘటన కలకలం రేపుతోంది. చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు ఖైదీలు కరోనా బారిన పడగా... చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇదే అదునుగా భావించిన ఖైదీలు తెల్లవారుజామున 3 గంటల సమయంలో గాంధీ ఆసుపత్రి ప్రధాన భవనం రెండో అంతస్తులోని బాత్రూం గ్రిల్స్ తొలగించుకుని బయటకు పారిపోయారు. వార్డు బయట పోలీసులు భద్రత కల్పించినప్పటికీ... వారి కళ్లుగప్పి తప్పించుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఖైదీలను వెతికే పనిలో పడ్డారు. సీసీ కెమెరాల ద్వారా... నేరస్థులు ఎటు వెళ్లారు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
గాంధీ ఆస్పత్రి నుంచి నలుగురు ఖైదీలు పరారీ
prisoners escaped from gabdhi hospital
10:04 August 27
గాంధీ ఆస్పత్రి నుంచి నలుగురు ఖైదీలు పరారీ
Last Updated : Aug 27, 2020, 12:42 PM IST