తెలంగాణ

telangana

గురువారం కొవిడ్ టీకా తీసుకోనున్న ఏపీ సీఎం జగన్

By

Published : Mar 30, 2021, 5:17 PM IST

ఏపీ గుంటూరులో ఏప్రిల్ 1న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోనున్నారు. అక్కడ పరిస్థితులను కలెక్టర్ వివేక్ యాదవ్, జేసీ ప్రశాంతి, అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి పరిశీలించారు.

Cm jagan
టీకా తీసుకోనున్న ఏపీ సీఎం జగన్

ఏపీ సీఎం జగన్​ గుంటూరులో ఏప్రిల్ 1న కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోనున్నారు. ఈ క్రమంలో 45 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు గుంటూరు భారత్​పేటలోని 140వ వార్డు సచివాలయంలో వ్యాక్సిన్ తీసుకోనున్నారు.

అనంతరం కాసేపు వార్డు, సచివాలయంలోని ఉద్యోగులు, వైద్య సిబ్బందితో ముఖ్యమంత్రి మాట్లాడతారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను కలెక్టర్ వివేక్ యాదవ్, జేసీ ప్రశాంతి, అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి పరిశీలించారు.

టీకా తీసుకోనున్న ఏపీ సీఎం జగన్

ఇదీ చదవండి:'430 జిల్లాల్లో నెల రోజులుగా కరోనా కేసులు సున్నా'

ABOUT THE AUTHOR

...view details