ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 0.9 కి.మీ. ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ అధికారి తెలిపారు. ఉత్తర కర్ణాటక నుంచి కేరళ వరకు బలహీనపడిన ద్రోణి.. పశ్చిమ మధ్యప్రదేశ్ నుంచి ఉత్తర కర్ణాటక వరకు ద్రోణి ఏర్పడిందని చెప్పారు.
రాగల మూడ్రోజులు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు
రాష్ట్రంలో రాగల మూడ్రోజులు ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తున ఏర్పడిన ఉపరితల ఆవర్తనమే దీనికి కారణమని తెలిపింది.
తెలంగాణలో వర్షాలు, తెలంగాణలో వెదర్ అప్డేట్స్
విదర్భ, మరట్వాడా మీదుగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి వల్ల రాగల మూడ్రోజులు రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఇదీ చదవండి డీఆర్డీఓ కొవిడ్ ఔషధానికి డీసీజీఐ అనుమతి