ముదిగొండ ఎస్సైపై వేటు పడింది. పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని బాధ్యత రహితంగా వ్యవహరించడంపై పోలీస్ కమిషనర్ స్పందించారు. ఎస్సై సతీశ్ కుమార్ను ఏఆర్ హెడ్ క్వార్టర్స్ అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఘటనపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి నివేదిక అందజేయాలని ఖమ్మం రూరల్ ఏసీపీని ఆదేశించారు.
ముదిగొండ ఎస్సైపై వేటు.. ఏఆర్ హెడ్ క్వార్టర్స్కు అటాచ్ - khammam dist news
ఖమ్మం జిల్లా ముదిగొండలో పేకాట ఆడుతున్న వారిపై ఎస్సై ప్రతాపం చూపించిన ఘటన సర్వత్రా విమర్శలకు దారి తీసింది. ఎస్సై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నతాధికారులు ఏఆర్ హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
![ముదిగొండ ఎస్సైపై వేటు.. ఏఆర్ హెడ్ క్వార్టర్స్కు అటాచ్ mudigonda police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6611694-thumbnail-3x2-glr.jpg)
ముదిగొండ ఎస్సైపై వేటు
ఈనెల 28న ముదిగొండ పీఎస్ పరిధిలోని వనవారి కృష్టాపురం గ్రామంలో పేకాట అడుతున్నారనే సమాచారంతో ఎస్సై సతీశ్ కుమార్ తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. పేకాట అడుతున్న వారిని అదుపులోకి తీసుకొన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీనితోపాటు బాధ్యత రహితంగా వ్యవహరించిన తీరు సర్వత్రా విమర్శలకు దారి తీసింది.
ఇవీ చూడండి:ఆపరేషన్ నిజాముద్దీన్: ఆ 157 మంది ఎక్కడ?
Last Updated : Mar 31, 2020, 10:05 PM IST