తెలంగాణ

telangana

By

Published : Sep 2, 2020, 8:39 PM IST

ETV Bharat / city

ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్.. ఏసీబీ అంటూ డబ్బు వసూళ్లు

ఏసీబీ అధికారులమని బెదిరిస్తూ... డబ్బులు వసూలు చేస్తున్న ఓ ముఠాను ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని ప్రభుత్వ అధికారులే లక్ష్యంగా... ఈ వ్యవహారం నడుపుతున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్..
ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్..

ఏసీబీ అధికారులమంటూ.. బెదిరింపులకు పాల్పడుతున్న ఆరుగురిని కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు ట్రైనీ ఎస్పీ శివకిషోర్ తెలిపారు. గతంలో ఏసీబీ అధికారినని బెదిరింపులకు పాల్పడి జైలుకెళ్లిన జయకృష్ణ... తన తోటి నేరస్థులతో ఓ ముఠాగా ఏర్పడి... ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు శివకిషోర్ వెల్లడించారు. ఇప్పటి వరకు సుమారు 70 నుంచి 80 మంది ఉద్యోగులను బెదిరించారని... రూ.14,34,000 వసూలు చేశారని ట్రైనీ ఎస్పీ వివరించారు.

ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్..

ABOUT THE AUTHOR

...view details