ఎంటెక్, ఎంఆర్క్, ఎంఫార్మా ప్రవేశాల కోసం పీజీ ఈసెట్ షెడ్యూలు ఖరారైంది. మార్చి 3న పీజీ ఈసెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 12 నుంచి ఏప్రిల్ 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తారు.
మే 6 వరకు రూ.500.... మే 13 వరకు రూ. 2వేల.. మే 20 వరకు రూ. 5 వేల...మే 26 వరకు రూ.10వేలఆలస్య రుసుముతో దరఖాస్తులు సమర్పించవచ్చు.
మే 20 నుంచి మే 27 వరకు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 15న ఫలితాలు ప్రకటిస్తారు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.500, ఇతరులు వెయ్యి రూపాయలు పరీక్ష రుసుము చెల్లించాలని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. పీజీ ఈసెట్ కన్వీనర్గా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కుమార్ వ్యవహరిస్తున్నారు.
ఇవీచూడండి:విలువలు, విశ్వసనీయతే మా బలం: ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి