పోస్టు గ్రాడ్యుయేషన్(పీజీ) ఉమ్మడి ప్రవేశ పరీక్ష-2021ను ఏపీ ఉన్నత విద్యామండలి అక్టోబర్లో నిర్వహించనుంది. ఇప్పటి వరకు విశ్వవిద్యాలయాల వారీగా నిర్వహిస్తున్న ఈ పరీక్షను అన్నింటికీ కలిపి నిర్వహించనున్నారు. డిగ్రీ పరీక్షలు పూర్తి కానందున అక్టోబరులో నిర్వహించాలని నిర్ణయించారు.
PG CET: అక్టోబర్లో పీజీసెట్ పరీక్షల నిర్వహణ - pg cet schedule in ap
ఏపీ పీజీ సెట్-2021 ఉమ్మడి ప్రవేశ పరీక్ష అక్టోబర్లో జరగనుంది. ఉన్నత విద్యామండలి పరీక్షలను నిర్వహించనుంది. ఇప్పటి దాకా విశ్వవిద్యాలయాల వారీగా పరీక్షలు జరుగుతుండగా.. ఇక నుంచి ఉమ్మడిగా నిర్వహించనున్నారు.
![PG CET: అక్టోబర్లో పీజీసెట్ పరీక్షల నిర్వహణ pg-cet-exams](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12367881-522-12367881-1625536038801.jpg)
PG CET: అక్టోబర్లో పీజీసెట్ పరీక్షల నిర్వహణ
ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా, ర్యాంకులు కేటాయించి ప్రవేశాలు కల్పిస్తారు. ఆ రాష్ట్ర వ్యాప్తంగా జేఎన్టీయూలు మినహా మిగతా అన్ని వర్సిటీల్లోని పీజీల్లో సీట్లు భర్తీ చేయనున్నారు. అన్ని వర్సిటీల్లో కలిపి 12వేల వరకు సీట్లు ఉండగా.. 50వరకు వివిధ రకాల కోర్సులున్నాయి. ఒక్కో కోర్సుకు ఒక్కో పరీక్ష నిర్వహిస్తారు.
ఇదీ చదవండి:TS AP WATER WAR: కృష్ణా జలాల వివాదంపై స్వరం పెంచిన తెలుగు రాష్ట్రాలు