తెలంగాణ

telangana

పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: తలసాని

By

Published : Dec 29, 2020, 3:39 PM IST

సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి తలసాని అన్నారు. 32 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్​ చెక్కులను అందించారు.

TALASANI
పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: తలసాని

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పథకాలు అమలుచేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్​ అన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

వెస్ట్ మారేడ్​పల్లిలోని తన నివాసంలో.. 32 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందించారు. పేదింటి ఆడపడుచుల వివాహాలకు చేయూత అందించాలనే ఉద్దేశ్యంతోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆసరా పింఛన్లు, రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు గుర్తుచేశారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే.. తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు.

ఇవీచూడండి:ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలి : కోదండరాం

ABOUT THE AUTHOR

...view details