తెలంగాణ

telangana

Janasena chief Pawan kalyan: 'అంబేడ్కర్​పై భక్తిభావంతోనే.. అక్కడిదాకా వెళ్లాను'

By

Published : Dec 6, 2021, 1:54 PM IST

Janasena chief Pawan kalyan: రాజ్యాంగ నిర్మాత బీ.ఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ కారణజన్ముడని కొనియాడారు.

pawan kalyan tributes to ambedkar
అంబేడ్కర్​కు పవన్​ కల్యాణ్​ నివాళి

Janasena chief Pawan kalyan: రాజ్యాంగ నిర్మాత డా. బీ.ఆర్. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా.. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నివాళులర్పించారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ కారణజన్ముడని.. భారత రాజ్యాంగ శిల్పిగా పూజలు అందుకుంటున్న మహనీయుడని కొనియాడారు.

ఆయన ఆలోచనలు భావితరాలకు అనుసరణీయని పేర్కొన్నారు. అంబేడ్కర్ పట్ల తనకు ఎంతో భక్తి భావం ఉందన్న పవన్.. ఆ భావనే లండన్​లో ఆయన నివసించిన గృహాన్ని, లక్నోలో ఆయన స్మారక మందిరాన్ని సందర్శించేలా చేసిందని తెలిపారు. రాజ్యాంగంలో ఆయన కల్పించిన పౌరహక్కులు, ఆదేశిక సూత్రాలు నేటికీ, ఏనాటికీ ప్రజలకు రక్షణగా నిలుస్తాయని వెల్లడించారు.

ఇదీ చదవండి:New zonal system in Telangana: స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజనకు విధివిధానాల ప్రకటన

ABOUT THE AUTHOR

...view details