శంషాబాద్ హత్య ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి జనసేన తరపున ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని బహిరంగంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నగర శివార్లలో పోలీస్ పెట్రోలింగ్, పర్యవేక్షణ పెంచాలని సూచించారు. విద్యార్థినులు, యువతుల్లో ఆత్మస్థైర్యం పెంచే మార్షల్ఆర్ట్స్ నేర్పించాలని అభిప్రాయపడ్డారు.
'అఘాయిత్యాలకు పాల్పడితే బహిరంగంగా శిక్షించాలి'
ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని... బహిరంగంగా శిక్షించాలని పవన్కల్యాణ్ డిమాండ్ చేశారు. శంషాబాద్ హత్య ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
శంషాబాద్ ఘటనపై స్పందించిన పవన్కల్యాణ్