వ్యవసాయ సీజన్లో రైతులు నాలుగుసార్లు నష్టపోయారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న పవన్... పంట కలుపు తీయడానికి డబ్బులు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న ఒక్కరోజే నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న పవన్... పంట నష్టపోతే ప్రాణాలు తీసుకోవడం రైతుల దీనస్థితికి నిదర్శనమన్నారు.
"కృష్ణా, గుంటూరులో రైతులను ప్రత్యక్షంగా కలిసి మాట్లాడాను. క్షేత్ర పరిశీలన తర్వాత పంట నష్టంపై కేంద్రానికి నివేదిక పంపిస్తాం. కౌలు రైతులకు జనసేన అండగా ఉంటుంది. కౌలు రైతు, భూమి దున్నే రైతుల కోసం 'జైకిసాన్' కార్యక్రమం చేపడతాం. లాల్బహదూర్ శాస్త్రి స్ఫూర్తితో రైతు సంఘాలతో చర్చలు జరుపుతాం. రైతులకు రూ.35 వేల ముందస్తు సాయం అందివ్వాలి. రైతులు లాభసాటిగా ఉండాలనే కేంద్రం కిసాన్ బిల్లులు తెచ్చింది. కిసాన్ బిల్లులపై అభ్యంతరాలు ఉంటే చెప్పండని కేంద్రం కోరుతోంది."
-పవన్ కల్యాణ్
రైతులకు రూ.35 వేల ముందస్తు సాయం ఇవ్వాలి: పవన్
సమస్య వచ్చినప్పుడల్లా పవన్ కల్యాణ్ మాత్రమే స్పందించాలా..?