తెలంగాణ

telangana

ETV Bharat / city

'తెలంగాణలో బలోపేతానికి అనుకూల వాతావరణం' - భాజపాతో జనసేన భేటీ వార్తలు

భాజపాతో పొత్తు విషయంలో చాలా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలపై జనసేన కార్యకర్తలు పూర్తి అవగాహనతో ఉండాలని....అపోహలకు గురి కావద్దన్నారు.

'పొత్తుపై లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం'
'పొత్తుపై లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం'

By

Published : Jan 19, 2020, 8:04 AM IST


భాజపాతో పొత్తు విషయంలో చాలా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వివరించారు. హైదరాబాద్ ప్రశాసన్ నగర్‌లోని పార్టీ కార్యాలయంలో గ్రేటర్ హైదరాబాద్ ప్రాంత ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రాలు, దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలు, ప్రజల సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పొత్తు కుదుర్చుకున్నట్లు తెలిపారు.

అపోహలకు గురి కావొద్దు

గత కొన్ని నెలలుగా పొత్తుపై...భాజపా అగ్రనాయకత్వంతో దఫదఫాలుగా చర్చలు జరిగాయన్నారు. ఇరు పక్షాల నుంచి పొత్తు విషయంలో ఎలాంటి షరతులు లేవని వెల్లడించారు. నిజానికి 2014 ఎన్నికల సమయంలోనే భాజపాతో కలసి పనిచేసినట్లు గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలపై జనసేన కార్యకర్తలు పూర్తి అవగాహనతో ఉండాలని....అపోహలకు గురి కావద్దన్నారు.

తెలంగాణలో పార్టీ బలోపేతమవుతుంది...

తెలంగాణాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా...జనసేన పార్టీని బలోపేతం చేయడానికి సమయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ముందుగా గ్రేటర్ హైదరాబాద్ కమిటీని నియమించబోతున్నట్లు...అందుకు అర్హులయిన వారి పేర్లను కార్యకర్తలే సూచించాలన్నారు. ఇక నుంచి నెలలో కొన్ని రోజులపాటు తెలంగాణలో పార్టీ కార్యకలాపాల కోసం....సమయాన్ని కేటాయిస్తానని కార్యకర్తలకు హామీ ఇచ్చారు.

'పొత్తుపై లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం'

ఆ చట్టంతో అన్యాయం జరగదు..

పౌరసత్వ సవరణ చట్టాన్ని అర్ధం చేసుకోవడంలో చాలామంది కొంత అపోహకు గురవుతున్నారని... ఈచట్టం వల్ల దేశంలోని ఏ ఒక్క ముస్లింకు అన్యాయం జరగదన్నారు.

ఇదీ చదవండి : అబద్ధాలు, సీఎం జగన్ అవిభక్త కవలలు: నారా లోకేష్

ABOUT THE AUTHOR

...view details