రాష్ట్రంలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా... పాస్పోర్టు సేవా కేంద్రాల్లో అపాయింట్మెంట్లను సగానికి తగ్గించినట్లు సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు అధికారి దాసరి బాలయ్య తెలిపారు. రాష్ట్రంలోని 14 తపాలా కార్యాలయాల ద్వారా పాస్పోర్టు సేవలు వచ్చే నెల14వ తేదీ వరకు నిలిపివేసినందున.. అక్కడి అపాయింట్మెంట్లను మే 17 తర్వాతకు రీ షెడ్యూల్ చేయనున్నట్లు వివరించారు. దరఖాస్తుదారులు సైతం ప్రస్తుతం పని చేస్తున్న పాస్పోర్టు సేవా కేంద్రాలకు వెళ్లి వారి అపాయింట్మెంట్లను రీషెడ్యూల్ చేసుకునే వెసులుబాటు ఉందన్నారు.
మే 17 తర్వాతకు పాస్పోర్టు అపాయింట్మెంట్లు రీషెడ్యూల్ - పాస్పోర్టు అపాయింట్మెంట్లు రీషెడ్యూల్
పాస్పోర్టు సేవలు వచ్చే నెల14వ తేదీ వరకు నిలిపివేసినందున.. అపాయింట్మెంట్లను మే 17 తర్వాతకు రీ షెడ్యూల్ చేయనున్నట్లు సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు అధికారి దాసరి బాలయ్య వివరించారు. దరఖాస్తుదారులు సైతం ప్రస్తుతం పని చేస్తున్న పాస్పోర్టు సేవా కేంద్రాలకు వెళ్లి వారి అపాయింట్మెంట్లను రీషెడ్యూల్ చేసుకునే వెసులుబాటు ఉందన్నారు.
passport-appointments-rescheduled-after-may-17th
దరఖాస్తుదారులు వెళ్లలేని పరిస్థితులు ఉంటే... ఎలాంటి అపరాధ రుసుం లేకుండా అపాయింట్మెంట్ను రీషెడ్యూల్ చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 21వ తేదీ నుంచి పాస్పోర్టు అపాయింట్మెంట్ స్లాట్లను 50 శాతానికి కుదించినట్లు వివరించారు. బేగంపేట్, అమీర్పేట్, టోలిచౌకి, నిజామాబాద్, కరీంనగర్ పాస్పోర్టు సేవా కేంద్రాల్లో ఈ కుదింపు అమలులోకి వచ్చినట్లు తెలిపారు. సేవా కేంద్రాల వద్ద వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకే 50 శాతానికి అపాయింట్మెంట్లను కుదించినట్లు వివరించారు.