- 30 రోజుల ప్రణాళిక గ్రామాలకు ఎలాంటి తోడ్పాటు ఇవ్వనుంది?
పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలను గ్రామాల్లో నిరంతరం చేపట్టాల్సిందే. వాటికి ప్రేరణగా నిలిచేదే 30 రోజుల ప్రణాళిక. దీంతో గ్రామాలు శోభాయమానమవుతున్నాయి. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి శ్రమదానంలో పాల్గొంటున్నారు. మరోవైపు కోతులు ఇష్టపడే నేరేడు, జామ, ఉసిరి వంటి మొక్కలను అటవీ ప్రాంతాల్లో విరివిగా పెంచుతున్నాం. ఈ చర్యతో మరో రెండేళ్లలో గ్రామాల్లో కోతుల సమస్య ఉండనే ఉండదు.
- కేంద్ర ఆర్థిక సంఘం నుంచి వచ్చిన వాటితోసహా తమకు నిధులను సకాలంలో ఇవ్వడంలేదని సర్పంచులు వాపోతున్నారు. చెక్కులపై సర్పంచి, ఉపసర్పంచి సంయుక్త సంతకాల విధానాన్నీ కొందరు వ్యతిరేకిస్తున్నారు కదా?
కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు రాష్ట్ర ప్రభుత్వ వాటాను కలిపి ప్రతినెలా రూ.339 కోట్ల చొప్పున పంచాయతీలకు ఇచ్చే విధానాన్ని ఈ నెల నుంచి మొదలుపెట్టాం. ఇక నిధుల సమస్య అనేదే ఉత్పన్నంకాదు. పంచాయతీలు గతంలో తాగునీటికి చేసే ఖర్చంతా మిషన్ భగీరథ వల్ల వాటికి మిగులుతోంది. 30 రోజుల ప్రణాళికలో భాగంగా విద్యుత్ సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాం కాబట్టి ఆ వ్యయమూ ఆదా అవుతుంది. ప్రజాప్రతినిధులు ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకునేందుకే ఉమ్మడి సంతకాల విధానాన్ని తీసుకొచ్చాం. సంతకం చేసేందుకు ఎవరైనా ఉప సర్పంచి అంగీకరించకుంటే కలెక్టర్కు ఫిర్యాదు చేయొచ్చు.
- ఆర్థిక సంఘం నిధులను ఆయా పంచాయతీలకు నేరుగా పంపాలని కేంద్రం యోచిస్తోంది. దీనిపై మీ అభిప్రాయం?