తెలంగాణ

telangana

'కొత్త రెవెన్యూ చట్టంతో రైతులు, పేదలకు ఎంతో మేలు'

ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ పాలాభిషేకం చేశారు. కేసీఆర్ పేరు చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోతుందన్నారు.

By

Published : Sep 14, 2020, 9:47 PM IST

Published : Sep 14, 2020, 9:47 PM IST

palabhishekam-to-cm-kcr-photo-at-gandpark-hyderabad
'కొత్త రెవెన్యూ చట్టంతో రైతులు, పేదలకు ఎంతో మేలు'

కొత్త రెవెన్యూ చట్టంతో రైతులు, పేద ప్రజల సమస్యలు తీరనున్నాయని తెరాస ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ అన్నారు. గన్​పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.కేసీఆర్ పేరు చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోతుందన్నారు.

అవినీతిమయమైన రెవెన్యూ చట్టాన్ని రద్దు చేసి రైతులందరికి మేలు చేసే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి అన్ని వర్గాల ప్రజల అభినందనలు పొందారని పేర్కొన్నారు. భూముల విలువ పెరగటం వల్లే కబ్జా కోరులు, బోకర్లు ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని.. ఇకపై వారి ఆటలు సాగవని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:రెవెన్యూ బిల్లుకు శాసన మండలి ఆమోదం

ABOUT THE AUTHOR

...view details