తెలంగాణ

telangana

By

Published : Jun 27, 2020, 9:28 PM IST

ETV Bharat / city

తెలుగు వారు గర్వించదగ్గ వ్యక్తి పీవీ: కిషన్​రెడ్డి

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకోని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జీ కిషన్​రెడ్డి నివాళి అర్పించారు. భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పీవీ చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు.

కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జీ.కిషన్​రెడ్డి నివాళి
కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జీ.కిషన్​రెడ్డి నివాళి

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఆదివారం జరుపుకుంటున్న సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి నివాళి అర్పించారు. పీవీ నరసింహారావు పరిపాలనా దక్షుడిగా, తెలుగు ప్రజలు గర్వంచదగ్గ వ్యక్తని కొనియాడారు.

దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన వ్యక్తి సేవలు ఎన్నటికీ మరిచిపోలేమన్నారు. అలాంటి మహనీయుడు జన్మించి వందేళ్లవుతున్న సందర్భంగా పీవీకి హృదయపూర్వకమైన శ్రద్ధాంజలి సమర్పిస్తున్నట్లు తెలిపారు.

తెలుగు వారు గర్వించదగ్గ వ్యక్తి పీవీ: కిషన్​రెడ్డి

ఇవీ చూడండి:శతజయంతి వేడుకలకు రంగం సిద్ధం.. రేపే కార్యక్రమాల ప్రకటన

ABOUT THE AUTHOR

...view details