గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఏపీ రాజమహేంద్రవరం వద్ద పరవళ్లు తొక్కుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో 12 అడుగుల నీటి మట్టం ఉంది. పోలవరం ప్రాజెక్ట్ వెనకకు మళ్లిన వరద నీటితో ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల్లో వరద నెమ్మదిగా ప్రవహిస్తోంది. వరద తీవ్రతతో విలీన మండలాలైన ఎటపాక, కూనవరం, వీఆర్ పురం మండలాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ముంపు రెండో రోజూ కొనసాగింది. ఎటపాకలో సుమారు 250 ఎకరాల్లో వరి, మిరప పంటలు ముంపు బారినపడ్డాయి. వీఆర్ పురం మండలంలోని రహదారులపైకి నీరు చేరడంతో సుమారు 20 గ్రామాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కూనవరం మండలంపైనా వరద ప్రభావం పడింది. దేవీపట్నం మండలం ఇంకా జలదిగ్బంధంలోనే కొనసాగుతోంది.
GODAVARI FLOODS: ముంచెత్తిన గోదావరి వరద.. జలదిగ్బంధంలోనే విలీన మండలాలు - godavari latest news
గోదావరికి వరద పోటెత్తింది. ఏపీ రాజమహేంద్రవరం వద్ద నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. భద్రాచలం వద్ద వరద కాస్త తగ్గుముఖం పట్టగా... ధవళేశ్వరం వద్ద క్రమంగా తగ్గే అవకాశం ఉంది. కోనసీమ లంక గ్రామాల్నీ వరద ముంచెత్తింది. దేవీపట్నం మండలం ఇప్పటికీ జలదిగ్భందంలోనే ఉంది. వరద కారణంగా విలీన మండలాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
![GODAVARI FLOODS: ముంచెత్తిన గోదావరి వరద.. జలదిగ్బంధంలోనే విలీన మండలాలు GODAVARI FLOODS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13030494-826-13030494-1631326741238.jpg)
ధవళేశ్వరం ఆనకట్ట నుంచి 10లక్షల 19వేల లక్షల క్యూసెక్కులపైగా నీరు సముద్రంలోకి వదలడంతో గౌతమి, వశిష్ఠ, వైనతేయ నదీపాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. అయినవిల్లి మండలం ఎదురుబీడెం కాజ్ వే పై వరద నీరు ప్రవహిస్తుండతో లంక గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. పి. గన్నవరం మండల పరిధిలోని పశ్చిమగోదావరి జిల్లా కనకాయలంక కాజ్ వేపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం, పి.గన్నవరం, మామిడికుదురు, సఖినేటిపల్లి, మండలాలతోపాటు ఆలమూరు, కపిళేశ్వరపురం మండలాల్లోని నదీ తీరం పొలాలు ముంపు బారిన పడ్డాయి. కేంద్రపాలిక ప్రాంతం యానానంలోని లోతట్టు ప్రాంతాల్నీ వరద చుట్టుముట్టేసింది.
ఇవీ చూడండి:Engineering colleges: రాష్ట్రంలో 85,149 ఇంజినీరింగ్ సీట్లకు అనుమతి