తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ పంచాయతీ ఫలితం: విజయాన్ని మార్చేసిన ఒక్క ఓటు - Panchyathi elections news

ఒక్క ఓటు సర్పంచ్ అభ్యర్థికి విజయాన్ని కట్టబెట్టింది. ఏపీలోని కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో కేవలం ఒక్క ఓటుతో కందలంపాడు సర్పంచ్‌గా బైరెడ్డి నాగరాజు విజయం సాధించారు.

ఏపీ పంచాయతీ ఫలితం: విజయాన్ని మార్చేసిన ఒక్క ఓటు
ఏపీ పంచాయతీ ఫలితం: విజయాన్ని మార్చేసిన ఒక్క ఓటు

By

Published : Feb 10, 2021, 3:09 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో కేవలం ఒక్క ఓటు సర్పంచ్‌ అభ్యర్థి విజయాన్ని మార్చేసింది. మండలంలోని కందలంపాడు సర్పంచ్‌గా బైరెడ్డి నాగరాజు విజయం సాధించారు. ప్రత్యర్థి మొవ్వ సుబ్రహ్మణ్యంపై గెలుపొందారు. అతిచిన్న గ్రామం కావడంతో 203 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. వీటిలో నాగరాజుకు 102, సుబ్రహ్మణ్యంకు 101 ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్‌ చేసినా అదే ఫలితం రావడంతో అధికారులు నాగరాజును సర్పంచ్‌గా ప్రకటించారు.

అదే మండలంలోని జగన్నాథపురంలో పిన్నిబోయిన శ్రీనివాసరావు మూడు ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

మరికొందరు..

  • నెల్లూరు: పామూరుపల్లి సర్పంచిగా ఒక్క ఓటు ఆధిక్యంతో తెల్ల గొర్ల సుశీల విజయం సాధించారు.
  • గుంటూరు: పిడపర్తిపాలెం సర్పంచిగా 1 ఓటు ఆధిక్యంతో గెలిచిన కరుణశ్రీ
  • విశాఖ: తగరంపూడి సర్పంచిగా 2 ఓట్ల ఆధిక్యంతో అప్పారావు గెలుపొందారు.
  • గుంటూరు: తోట్లపాలెం సర్పంచిగా 6 ఓట్లతో వీరరాఘవయ్య గెలుపు

ఇదీ చూడండి: 'భవిష్యత్తులో ఏ ఉపద్రవాన్నైనా ఎదుర్కొనే సత్తా తెలంగాణకు ఉంది'

ABOUT THE AUTHOR

...view details