తెలంగాణ

telangana

ETV Bharat / city

20 రోజుల్లో తెరాస నాయకుడి ఇంట్లో నలుగురు మృతి - covid -19 updates

హైదరాబాద్​లో కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. 20 రోజుల వ్యవధిలోనే కుటుంబంలోని పెద్దలు మరణించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కార్పొరేట్ ఆస్పత్రిలో ముగ్గురిలో ఒకరికి రూ.18 లక్షలు వెచ్చించి వైద్యం అందించినప్పటికీ ప్రాణాలు గాలిలో కలిశాయి.

one family four deaths in mjusheerabad
one family four deaths in mjusheerabad

By

Published : Jul 30, 2020, 10:46 PM IST

Updated : Jul 30, 2020, 11:26 PM IST

ముషీరాబాద్ నియోజకవర్గంలోని అడిక్మెట్ డివిజన్లోని ఓ తెరాస నేత ఇంట్లో కుటుంబ పెద్దలందరూ 20 రోజుల వ్యవధిలో వివిధ కారణాలతో మృత్యువాత పడ్డారు. కరోనా వైరస్​కు సంబంధించిన లక్షణాలతోనే ఈ మరణాలు సంభవించాయని పలువురు అనుమానం వ్యక్తం చేయగా... కుటుంబ సభ్యులు వాటిని ఖండిస్తున్నారు.

తెరాస నాయకుడు మహమ్మద్ ముసా తండ్రి ఈ నెల 7న గుండెపోటుతో బాధపడగా... విద్యానగర్​లోని దుర్గాబాయి దేశ్​ముఖ్ ఆస్పత్రికి తీసుకెళ్లాగా బ్లాక్​​ డెడ్​ అని ఆసుపత్రి వర్గాలు రాసి ఇచ్చారు. అదే రోజు సాయంత్రం మహమ్మద్ ముసా దగ్గు, జ్వరం, శ్వాసకోశ సంబంధ సమస్యలతో హైటెక్​సిటీలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో బెడ్ కోసం లక్షలు వెచ్చించి చేరారు. చికిత్స పొంది ఇంటికి వచ్చిన కొన్ని రోజుల తర్వాత తిరిగి అతను అనారోగ్యానికి గురయ్యారు.

ఇదిలా ఉండగా మూసా తండ్రి మృతి చెందిన వారం లోపు ఆయన నాయనమ్మ, బాబాయ్​ 3 రోజుల వ్యవధిలో మృత్యువాత పడ్డారు. మహమ్మద్ ముసా వైద్యం చేయించుకోవటానికి నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగి దాదాపు రూ.18 లక్షలు వెచ్చించారు. అయినా ప్రాణాలు కాపాడుకోలేకపోయారు. ముసా మాత్రం నిమోనియా వ్యాధితో బాధపడుతూ చనిపోయారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. మూసకు భార్య, ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో 60 వేల మార్కును దాటిన కరోనా కేసులు

Last Updated : Jul 30, 2020, 11:26 PM IST

ABOUT THE AUTHOR

...view details