కరోనా కలవరంతో రహదారులకు అడ్డంగా మూడు చోట్ల గోడలు కట్టేశారు. ఆంధ్రా-తమిళనాడు సరిహద్దుల్లో చేపట్టిన ఈ నిర్మాణాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. చిత్తూరు జిల్లాలోని పలమనేరు నుంచి గుడియాత్తానికి వెళ్లే దారిలోనూ, చిత్తూరు-తిరుత్తణి మార్గంలో శెట్టింతంగాళ్ ప్రాంతంలోనూ, బొమ్మసముద్రం వద్ద జాతీయ రహదారిపై కూడా అడ్డంగా తమిళనాడు అధికారులు ఆదివారం సిమెంటు గోడలు కట్టించేశారు.
'కరోనాను గోడ దాటనీయం' - చిత్తూరు కరోనా వార్తలు
కరోనా భయం గోడ కట్టించేసింది. రాకపోకలను నియంత్రించేందుకు ముళ్ల కంపలు వేయటం చూశాం. తమిళనాడు అధికారులు మరో అడుగు ముందుకేసి రోడ్డుకడ్డంగా గోడ కట్టేశారు. చిత్తూరు జిల్లా.. ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో కడుతున్న గోడ నిర్మాణంపై చిత్తూరు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

కరోనాను గోడ దాటనీయం
సరిహద్దులో గోడ నిర్మించడం సరికాదని.. సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు పలమనేరు తహసీల్దార్ శ్రీనివాసులు చెప్పారు. వేలూరు జిల్లా అధికారులతో రాష్ట్ర అధికారులు సంప్రదిస్తున్నట్లు పేర్కొన్నారు.