తెలంగాణ

telangana

ETV Bharat / city

వినతులు ఇచ్చే వారికి... అధికారుల మర్యాదలు

అబ్దుల్లాపూర్​మెట్ తహసీల్దారు విజయారెడ్డి సజీవ దహనం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని రెవెన్యూ శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలు ఇచ్చిన అర్జీలను అధికారులు నిశిత పరిశీలన చేసి సమస్య పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నారు. వినతులు ఇచ్చే వారికి కుర్చీలు వేసి.. తాగునీరు ఇచ్చి మర్యాదలు చేస్తున్నారు.

By

Published : Nov 11, 2019, 9:06 PM IST

వినతులు ఇచ్చే వారికి... అధికారుల మర్యాదలు

వినతులు ఇచ్చే వారికి... అధికారుల మర్యాదలు

అబ్దుల్లాపూర్​మెట్​లో తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం తర్వాత... పలు కార్యాలయాల్లోని అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల ఆర్డీవో కార్యాలయంలో స్పందన కార్యక్రమానికి వచ్చిన ప్రజలను తనిఖీలు చేస్తున్నారు. వారి వద్ద ఉన్న చేతి సంచులను పరిశీలించిన తర్వాతే.. కార్యాలయం లోనికి పంపిస్తున్నారు. ప్రజలు ఇచ్చిన అర్జీలను అధికారులు పరిశీలించి సమస్య పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నారు. వినతులను ఇచ్చే వారికి కుర్చీలు వేసి.. తాగునీరు ఇచ్చి మర్యాదలు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details