Central Minister Nithin Gadkari: రాష్ట్రంలో 7 వేల 853కోట్ల వ్యయంతో చేపట్టిన... 12 జాతీయ రహదారులకు కేంద్ర రోడ్డు రవాణశాఖమంత్రి నితిన్ గడ్కరీ నేడు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ ఉదయం పదిన్నరకు శంషాబాద్లోని జీఎంఆర్ ఎరీనా వద్ద కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి 4 వేల 927కోట్ల వ్యయంతో చేపట్టనున్న.. 258 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల విస్తరణ పనులకు గడ్కరీ శంకుస్థాపన చేయనున్నారు.
నేడు రాష్ట్రానికి నితిన్ గడ్కరీ.. 258 కిమీ రహదారుల విస్తరణకు శంకుస్థాపన - national roads expansion in telangana
Central Minister Nithin Gadkari: కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహాదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నేడు రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రంలో చేపట్టిన 12 జాతీయ రహదారులకు కేంద్ర రోడ్డు రవాణశాఖమంత్రి నితిన్ గడ్కరీ నేడు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు.
![నేడు రాష్ట్రానికి నితిన్ గడ్కరీ.. 258 కిమీ రహదారుల విస్తరణకు శంకుస్థాపన Nitin Gadkari laid the foundation stone for expansion of 258 km of roads in telangana today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15144508-878-15144508-1651182890137.jpg)
Nitin Gadkari laid the foundation stone for expansion of 258 km of roads in telangana today
ఇప్పటికే 2 వేల 926కోట్లతో సిద్ధమైన 96 కిలోమీటర్ల రహదారులను..గడ్కరీ ప్రారంభిస్తారు. 2014 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 10 వేల 57కోట్ల వ్యయంతో...12 వందల 78 కిలోమీటర్ల రహదారులను విస్తరించినట్లు కేంద్రం తెలిపింది.
ఇదీ చూడండి: