తెలంగాణ

telangana

By

Published : Aug 13, 2021, 7:58 PM IST

ETV Bharat / city

NITI Aayog: సుస్థిరాభివృద్ధి సాధనలో సంస్కరణలే కీలకం..

మల్టీ డైమెన్షియల్‌ పావర్టీ ఇండెక్స్‌ సంస్కరణల ప్రణాళికను రూపొందించుకోవాలని ఏపీ ప్రభుత్వానికి నీతి ఆయోగ్‌ సూచించింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఏపీ సర్కారు పనితీరుపై సచివాలయంలో రెండో రోజు సమీక్ష నిర్వహించిన నీతి ఆయోగ్.. ఈ విషయంలో సంస్కరణలు చాలా కీలకమని వ్యాఖ్యానించింది.

niti aayog
నీతి ఆయోగ్​

సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వ పనితీరుపై సచివాలయంలో రెండో రోజు నీతి ఆయోగ్ సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్షలో నీతి ఆయోగ్‌ సలహాదారు, ఏపీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. మల్టీ డైమెన్షియల్‌ పావర్టీ ఇండెక్స్‌ సంస్కరణల ప్రణాళికను రూపొందించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్‌ సూచించింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో సంస్కరణలు చాలా కీలకమని వ్యాఖ్యానించింది. ఎంపీఐ ర్యాంకింగ్‌లో భారత్ 62వ స్థానంలో ఉందని వెల్లడించింది.

మానవాభివృద్ధి సూచీలో రాష్ట్రం అగ్రస్థానంలో కొనసాగుతున్నట్లు ఏపీ ప్రభుత్వం నీతి ఆయోగ్​కు వెల్లడించింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఆంధ్రప్రదేశ్​ 3వ స్థానంలో ఉందని తెలిపింది. త్వరలోనే మొదటి స్థానానికి చేరుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

సీఎంను కలిసిన నీతి ఆయోగ్ బృందం

సమీక్ష అనంతరం నీతి ఆయోగ్ బృంద సభ్యులు ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. ఎస్‌డీజీ ఇండియా ఇండెక్స్‌ 2020–21 రిపోర్టును సీఎంకు అందజేశారు.

ఇదీ చదవండి:Vote for note Case: విచారణకు రేవంత్ రెడ్డి.. అనిశాకు అసెంబ్లీ ప్రసంగాల రికార్డులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details