తెలంగాణ

telangana

By

Published : Dec 9, 2019, 6:48 PM IST

Updated : Dec 9, 2019, 8:54 PM IST

ETV Bharat / city

ఎన్​కౌంటర్​లో పాల్గొన్న పోలీసులను విచారించిన ఎన్​హెచ్​ఆర్సీ

దిశ నిందితుల ఎన్‌కౌంటర్​పై మూడో రోజు ఎన్​హెచ్​ఆర్సీ విచారణ కొనసాగుతోంది. ఎన్‌కౌంటర్​లో పాల్గొన్న పోలీసులను, పంచనామా నిర్వహించిన రెవెన్యూ అధికారులను విచారించినట్లు సమాచారం.

disha accused encounter
disha accused encounter

దిశ నిందితుల ఎన్‌కౌంటర్​పై జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ కొనసాగుతోంది. మూడో రోజు ఎన్​హెచ్​ఆర్సీ సభ్యులు విచారిస్తున్నారు. ఎన్‌కౌంటర్​లో పాల్గొన్న పోలీసులను, పంచనామా నిర్వహించిన రెవెన్యూ అధికారులను రాష్ట్ర పోలీస్ అకాడమీలో విచారించినట్లు సమాచారం. దిశ ఘటన, ఎన్​కౌంటర్​ వరకు అన్ని విషయాలను ఎన్​హెచ్​ఆర్సీ సేకరించింది.

ఎన్ కౌంటర్​లో గాయపడి గచ్చిబౌలి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్.ఐ.వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్​లను కూడా వివరాలు అడిగి తెలుసుకుంది. ఈ కేసులో నిందితుల కుటుంబసభ్యులను, దిశ కుటుంబసభ్యులను నిన్న విచారించారు. మానవ హక్కుల కమిషన్ విచారణకు సంబంధించి ఎలాంటి వివరాలు బయటకు రాకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు.

ఎన్​కౌంటర్​లో పాల్గొన్న పోలీసులను విచారించిన ఎన్​హెచ్​ఆర్సీ

ఇదీ చూడండి: ఎన్​హెచ్​ఆర్సీ ఎదుట దిశ తండ్రి, సోదరి... అరగంటపాటు విచారణ

Last Updated : Dec 9, 2019, 8:54 PM IST

ABOUT THE AUTHOR

...view details