రాయలసీమ ఎత్తిపోతలపై..ఎన్జీటీ చెన్నై ధర్మాసనం రేపు తీర్పు ఇవ్వనుంది. సెప్టెంబరు 3న ఎన్జీటీ తీర్పు రిజర్వు చేసింది. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవని తెలంగాణ వాసి శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు. రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.
రాయలసీమ ఎత్తిపోతలపై రేపు ఎన్జీటీ తీర్పు - రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ తీర్పు
రాయలసీమ ఎత్తిపోతలపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం నెలకొన్న విషయం తెలిసిందే. రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. రాయలసీమ ఎత్తిపోతలు పాత ప్రాజెక్టే అని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవని తెలంగాణ వాసి శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఎన్జీటీ ధర్మాసనం రేపు తీర్పు ఇవ్వనుంది.

రాయలసీమ ఎత్తిపోతలపై రేపు ఎన్జీటీ తీర్పు
ప్రాజెక్టు సామర్థ్యం రెట్టింపు చేసినందున పర్యావరణ అనుమతి కావాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. రాయలసీమ ఎత్తిపోతలు పాత ప్రాజెక్టనని ఏపీ ప్రభుత్వం వాదించింది. ఈ క్రమంలో రాయలసీమ ఎత్తిపోతలపై... ఎన్జీటీ చెన్నై ధర్మాసనం రేపు తీర్పు ఇవ్వనుంది.
ఇదీ చదవండి:పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల కింద కొత్త ఆయకట్టు లేదు: జగన్