తెలంగాణ

telangana

ETV Bharat / city

పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ నూతన కార్యాలయాలు ప్రారంభం - minister talasani srinivas yadav

తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ చొరవతో అందరి జీవితాలు బాగుపడ్డాయని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్ అన్నారు. హైదరాబాద్​ మాసబ్​ ట్యాంక్​ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ శాఖల కార్యాలయాలు ప్రారంభించారు.

పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ నూతన కార్యాలయాలు

By

Published : Oct 3, 2019, 11:27 AM IST

పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ నూతన కార్యాలయాలు ప్రారంభం

రెవెన్యూ అధికారులతో సమీక్ష చేసి నాణ్యమైన గొర్రెలు పంపిణీ చేస్తున్నామని, 20 కోట్ల చేపపిల్లలు పంపిణీ చేసిన ఘనత తెరాస ప్రభుత్వానిదేనని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. హైదరాబాద్​ మాసబ్​ట్యాంక్​లో పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. ఇక నుంచి అక్కడి నుంచే అన్ని కార్యకలాపాలు సాగుతాయని వెల్లడించారు. హుజూర్​నగర్​లో అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు... ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ఓటర్లను ప్రలోభ పెట్టాల్సిన అవసరం తెరాసకు లేదని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details