ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా రామతీర్థానికి కొత్త విగ్రహాలు చేరుకున్నాయి. బొడికొండపై ధ్వంసమైన కోదండి రాముని విగ్రహాల స్థానంలో ప్రతిష్ఠించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త విగ్రహాలను తయారుచేసింది. తిరుపతి నుంచి రామతీర్థం చేరుకున్న ఆ విగ్రహాలకు.. పొలిమేర నుంచి మంత్రోచ్ఛారణతో ఊరేగింపుగా తీసుకెళ్లారు.
రామతీర్థానికి రాములోరు... 28న ప్రతిష్ఠాపన - రామతీర్థం వివాదం తాజా వార్తలు
ఏపీలో విజయనగరం జిల్లా రామతీర్థంలో ధ్వంసమైన శ్రీరాముల వారి విగ్రహం స్థానంలో ప్రతిష్ఠించేందుకు కొత్త విగ్రహాలు అక్కడికి చేరుకున్నాయి. తిరుపతి నుంచి రామతీర్థం వచ్చిన విగ్రహాలను పొలిమేర నుంచి మంత్రోచ్ఛారణతో ఊరేగింపుగా తీసుకెళ్లారు.
ఏపీలోని రామతీర్థం చేరుకున్న రాములోరు...
శ్రీ రాముడుతోపాటు సీతాదేవి, లక్ష్మణ విగ్రహాలకు ఈ నెల 25 నుంచి 3 రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ విగ్రహాలను 28న రామతీర్థం ప్రధాన ఆలయ కళ్యాణ మండపంలోని బాలాలయంలో ప్రతిష్ఠించనున్నారు.