Telangana Corona Cases: రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. వేల సంఖ్యలో కేసులు నమోదవుతునే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 95,355 మందికి కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 3,590 మందికి మహమ్మారి సోకినట్టు నిర్ధరణైంది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 1,160 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మహమ్మారి కారణంగా ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 4,085కు చేరింది.
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి.. తాజాగా 3,590 కరోనా కేసులు - తెలంగాణలో కరోనా కేసులు
![రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి.. తాజాగా 3,590 కరోనా కేసులు New corona cases in telangana today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14317292-763-14317292-1643464537490.jpg)
19:20 January 29
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి.. తాజాగా 3,590 కరోనా కేసులు
వైరస్ నుంచి మరో 3,555 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 40,447 క్రియాశీల కేసులున్నాయి. కరోనా మహమ్మారి పట్ల ప్రజలు అలసత్వం వహించొద్దని వైద్యారోగ్య శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ విధిగా కొవిడ్ నిబంధనలను పాటించాలని సూచిస్తున్నారు. మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని చెబుతున్నారు.
తగ్గిన కేసులు.. పెరిగిన మరణాలు..
Corona cases in India: భారత్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఒక్కరోజులో.. 2,35,532 కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే ఈ సంఖ్య కాస్త తక్కువే. మరణాల సంఖ్య పెరిగింది. వైరస్తో మరో 871 మంది మరణించారు. 3,35,939 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.39 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
- మొత్తం కేసులు:4,08,58,241
- మొత్తం మరణాలు:4,93,198
- యాక్టివ్ కేసులు:20,04,333
- మొత్తం కోలుకున్నవారు:3,83,60,710
ఇదీ చూడండి: