తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో కొత్తగా 30 కరోనా కేసులు.. ఒకరు మృతి - ఆంధ్ర ప్రదేశ్ కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 30 మంది కరోనా బారిన పడినట్టు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నూతనంగా నమోదైన కేసులతో కొవిడ్ బాధితుల సంఖ్య 8,88,899కి చేరింది.

ap corona update
ఏపీలో కొత్తగా 30 కరోనా కేసులు.. ఒకరు మృతి

By

Published : Feb 15, 2021, 8:26 PM IST

గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 30 మందికి కొవిడ్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్త కేసులతో కలిపి ఏపీ వ్యాప్తంగా కొవిడ్ బారినపడ్డ వారి సంఖ్య 8,88,899కి చేరిందని వెల్లడించింది. తాజాగా.. కరోనా కారణంగా ఒకరు మృతి చెందగా... మహమ్మారి ప్రభావంతో ఇప్పటివరకు 7,163 మంది మృతి చెందినట్లు వివరించింది.

మరోవైపు.. గడిచిన 24 గంటల్లో 69 మంది కొవిడ్​ నుంచి కోలుకోగా.. మెుత్తం కోలుకున్నవారి సంఖ్య 8.8 లక్షలకు పైగా చేరింది. ఇప్పటి వరకు ఏపీలో కరోనా నిర్ధరణ పరీక్షలు కోటీ 35 లక్షలు దాటినట్లు తాజా బులెటిన్ లో వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇవీచూడండి:'కరోనాకు త్వరలో 19 టీకాలు!'

ABOUT THE AUTHOR

...view details