ప్రధాన మంత్రి జన్ధన్ ఖాతాల్లో రూ.500 చొప్పున మూడు నెలలపాటు జమ చేయనున్న కేంద్రం.. రేపటి నుంచి నగదు ఉపసంహరించుకోవచ్చని వెల్లడించింది. కరోనా ప్రభావం కారణంగా ఖాతాదారులు అంతా ఒకేసారి బ్యాంకుల వద్దకు వెళ్లకుండా నగదు ఉపసంహరణపై ఆంక్షలు విధించింది.
జన్ధన్ ఖాతాదారులు ఆంధ్రప్రదేశ్లో 1,18,55,366 మంది ఉండగా.. తెలంగాణలో 52 లక్షల 23వేల 218 ఖాతాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 1,70,78,584 జన్ధన్ ఖాతాలున్నాయి.
ఒక్కసారిగా ఖాతాదారులు బ్యాంకు శాఖలకు, ఏటీఎంల వద్దకు నగదు ఉపసంహరణ కోసం గుమిగూడే అవకాశం ఉందని అంచనా వేసిన అధికారులు కొన్ని ఆంక్షలు విధించారు.