తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో కొత్తగా 175 కరోనా కేసులు..

ఏపీలో కొత్తగా 175 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా వైరస్ బారిన పడి ఇద్దరు మృతిచెందారు. ఫలితంగా ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,91,563కి చేరింది.

By

Published : Mar 13, 2021, 8:35 PM IST

ap corona cases
ఏపీలో కొత్తగా 175 కరోనా కేసులు

ఏపీలో రోజురోజుకు కరోనా వైరస్ ప్రభావం పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 40,448 కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. 175 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 40, తూర్పు గోదావరిలో 31, కృష్ణాలో 24 మందికి కొవిడ్ పాజిటివ్​ వచ్చింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 8,91,563కి చేరింది.

కొవిడ్‌ కారణంగా అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 7,182కి చేరింది. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది.

తాజాగా 132 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 8,83,113కి చేరింది. ప్రస్తుతం 1,268 యాక్టివ్‌ కేసులున్నట్లు ఏపీ ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు ఏపీ వ్యాప్తంగా 1,44,89,098 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.

ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్​

ఇవీచూడండి:'అనుకున్న స్థాయిలో కరోనా వ్యాక్సినేషన్ సాగడం లేదు'

ABOUT THE AUTHOR

...view details