తెలంగాణ

telangana

By

Published : May 10, 2021, 4:29 PM IST

ETV Bharat / city

గర్భిణి మృతికి.. ఏపీ ప్రభుత్వ చేతకాని పాలనే కారణం: లోకేశ్

ఏపీలోని కాకినాడకు చెందిన గర్భణి, వాలంటీర్ లక్ష్మి మృతిపై.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాసుపత్రిలో చేరిన ఆమెకు వైద్యం అందట్లేదని వేడుకున్నా.. ఎవరు పట్టించుకోలేదన్నారు.

lokesh fires on ap government
ఏపీ ప్రభుత్వంపై లోకేశ్​ ఆగ్రహం

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఓ గర్భిణి, వాలంటీర్ లక్ష్మి మృతుపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​ ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్‌తో ప్రభుత్వాసుపత్రిలో చేరి వైద్యం అందట్లేదని వేడుకున్నా.. ఆమెను ఎవరూ పట్టించుకోకపోవడం వల్లనే మరణించిందని ఆరోపించారు.

కలెక్టర్ ఆదేశించినా వైద్యమందక కడుపులో బిడ్డతో సహా కన్నమూయాల్సి రావడానికి.. జగన్‌ ప్రభుత్వ చేతకాని పాలనే కారణం కాదా అని నిలదీశారు. ఇప్పటికైనా తాడేపల్లి రాజప్రాసాదంలో కూర్చుని ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెట్టాలనే కుతంత్రాలు మాని.. ప్రజల ప్రాణాలు కాపాడడంపై దృష్టి పెట్టాలని సూచించారు.

ఏపీ ప్రభుత్వంపై లోకేశ్​ ఆగ్రహం

ఇవీచూడండి:ఒకరికి తెలియకుండా ఒకరు.. ఒకే ఇంట ముగ్గురు

ABOUT THE AUTHOR

...view details