ఉమ్మడి నల్గొండ జిల్లాల డీసీసీబీ ఛైర్మన్, టెస్కాబ్ వైస్ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా సతీమణి, ఎమ్మెల్యే గొంగిడి సునీతతో కలిసి హైదరాబాద్ కర్మాన్ఘాట్ ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గొంగిడి మహేందర్ రెడ్డి దంపతులు స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.
కర్మాన్ఘాట్ అంజన్న సన్నిధిలో గొంగిడి సునీత దంపతులు - nalgonda district news
ఉమ్మడి నల్గొండ జిల్లాల డీసీసీబీ ఛైర్మన్, టెస్కాబ్ వైస్ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి తన పుట్టినరోజును పురస్కరించుకుని హైదరాబాద్ కర్మాన్ఘాట్ ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలను కరోనా మహమ్మారి బారి నుంచి కాపాడమని అంజన్నను వేడుకున్నట్లు తెలిపారు.

నల్గొండ డీసీసీబీ ఛైర్మన్, గొంగిడి మహేందర్ రెడ్డి
కరోనా మహమ్మారి నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడమని స్వామిని వేడుకున్నట్లు గొంగిడి మహేందర్ రెడ్డి తెలిపారు. ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించి వైరస్ బారిన పడకుండా ఉండాలని సూచించారు.