కృష్ణా జిల్లా విజయవాడలో దారుణం జరిగింది. నోవాటెల్ హొటల్ వద్ద వేణుగోపాల్రెడ్డి అనే వ్యక్తి.. కారులో ముగ్గురు ఉండగానే పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో నాగవల్లి, గంగాధర్, కృష్ణారెడ్డి అనే ముగ్గురు గాయపడ్డారు. వీరిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
దారుణం: కారులో ముగ్గురు ఉండగానే నిప్పంటించిన వ్యక్తి
ముగ్గురు వ్యక్తులు కారులో ఉండగానే.. పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా విజయవాడలో జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. స్థల వివాదమే ఈ హత్యాయత్నానికి కారణమని తెలుస్తుండగా.. బాధితులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
దారుణం: కారులో ముగ్గురు ఉండగానే నిప్పంటించిన వ్యక్తి
ఓ స్థలం విషయమై మాట్లాడేందుకు నలుగురు కారులో నోవాటెల్కు వచ్చారని.. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత వేణుగోపాల్ రెడ్డి కారు దిగి.. డోర్ వేసి నిప్పంటించినట్లు సమాచారం. ఈ దాడిలో కారు పూర్తిగా దగ్ధమైంది.
ఇదీ చూడండి..