తెలంగాణ

telangana

ETV Bharat / city

న్యాయవాదుల హత్యకు ప్రభుత్వానిదే బాధ్యత: ఉత్తమ్ - uttam kumar fires on kcr government

లాయర్​ వామన్​రావు దంపతుల హత్యపై టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. న్యాయవాదుల హత్య అత్యంత హేయమైన చర్య అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఘటనపై ఇంకా స్పందించకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర హోంమంత్రి పూర్తి డమ్మీగా మారిపోయారని ఆరోపించారు.

mp uttam kumar accuses trs government in high court lawyers murder
కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

By

Published : Feb 18, 2021, 1:53 PM IST

Updated : Feb 18, 2021, 1:58 PM IST

హైకోర్టు న్యాయవాదుల హత్యపై టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. న్యాయం కోసం పోరాడే వారిని చంపడం అత్యంత హేయమైన చర్యగా వర్ణించారు. తెరాస ప్రభుత్వం వచ్చింది.. రాష్ట్రాన్ని దోచుకునేందుకేనన్న ఉత్తమ్.. సాండ్, ల్యాండ్, మైన్, వైన్​ దోపిడీతో పాటు హత్యలకూ తెగబడుతున్నారని విమర్శించారు. వామన్​రావు దంపతుల హత్య తెరాస చేసిందేనని ఆరోపించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం ఈ హత్యలను ఖండించలేదని ఉత్తమ్ మండిపడ్డారు. తెలంగాణ పోలీసులు గులాబీ చొక్కా వేసుకున్నట్లు ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. వామన్​రావు దంపతులు.. తమకు ప్రాణహాని ఉందని చెప్పినా.. ఎవరూ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ పూర్తి డమ్మీగా మారారని అన్నారు. సీపీ సత్యనారాయణ తెరాస తొత్తులా పనిచేస్తున్నారని ఆరోపించారు.

నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. హత్య ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు సీజేను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి కూడా లేఖ రాస్తామని చెప్పారు. న్యాయవాదుల హత్యను పార్లమెంట్​లో ప్రస్తావిస్తామని స్పష్టం చేశారు.

Last Updated : Feb 18, 2021, 1:58 PM IST

ABOUT THE AUTHOR

...view details