ఏపీలోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్కు నోటీసులు పంపించారు. తనను అరెస్ట్ చేసిన సమయంలో సీఐడీ పోలీసులు తన దగ్గర తీసుకున్న వస్తువులు.. మెజిస్టేట్ వద్ద జమచేయాలన్నారు. అరెస్టు సమయంలో ఇంటి నుంచి పోలీసులు మొబైల్ ఫోన్ తీసుకెళ్లారన్నారు. తన ఫోన్లో విలువైన సమాచారం ఉందని.. నోటీసుల్లో పేర్కొన్నారు. ఇతర అంశాలతో పాటు మొబైల్ కోడ్ ఓపెన్ చేయాలని కస్టడీలో హింసించినట్లు నోటీసుల్లో రఘురామ తెలిపారు.
నా ఫోన్ ఇచ్చేయండి.. సీఐడీ అదనపు డీజీకి రఘురామ లీగల్ నోటీసు - ఎంపీ రఘురామకృష్ణరాజు తాజా వార్తలు
సీఐడీ అదనపు డీజీకి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లీగల్ నోటీసులు పంపించారు. అరెస్టు సమయంలో తీసుకున్న వస్తువులను మెజిస్ట్రేట్ వద్ద జమ చేయాలని నోటీసులో పేర్కొన్నారు.
![నా ఫోన్ ఇచ్చేయండి.. సీఐడీ అదనపు డీజీకి రఘురామ లీగల్ నోటీసు mp-raghuramakrishna-raju-legal-notices-to-cid-additional-dg](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11:44:07:1622873647-12022507-raghu.jpg)
నా ఫోన్ ఇచ్చేయండి.. సీఐడీ అదనపు డీజీకి రఘురామ లీగల్ నోటీసు