కరోనాపై ఏపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు. ప్రభుత్వం దృష్టికి ఎవరైనా సమస్యలు తీసుకొస్తే పరిష్కరించాలన్నారు.
పథకాలన్నింటికి జగన్ పేరు పెట్టుకోవడం అలవాటైంది: రఘురామకృష్ణరాజు - ఏపీలో కరోనా కేసులు
ఏపీలో కరోనా వేగంగా వ్యాప్తిస్తున్ననేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రభుత్వాన్ని కోరారు. రకారకాల పేర్లతో పథకాలు తీసుకొస్తున్న ప్రభుత్వం... కొవిడ్ విషయంలోనూ జగనన్న కరోనా కేర్ లేదా మరేదైనా పేరు పెట్టి అమలు చేయాలని సూచించారు.
![పథకాలన్నింటికి జగన్ పేరు పెట్టుకోవడం అలవాటైంది: రఘురామకృష్ణరాజు YCP RAGHURAMA KRISHNAM RAJU](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8189294-816-8189294-1595839507523.jpg)
పథకాలన్నింటికి జగన్ పేరు పెట్టుకోవడం అలవాటైంది: ఎంపీ రఘురామకృష్ణరాజు
పథకాలన్నింటికి జగన్ పేరు పెట్టుకోవడం అలవాటైందని వ్యాఖ్యానించారు. కరోనా విషయంలోనూ జగనన్న కరోనా కేర్ లేదా మరేదైనా పేరు పెట్టుకోండని సూచించారు. ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా చర్యలు తీసుకోవాలని హితవు పలికారు.
ఇవీచూడండి:కరోనాను ఓడిద్దాం.. ప్రాణాలతో నిలుద్దాం: కిషన్రెడ్డి