తెలంగాణ

telangana

మాణిక్కం ఠాగూర్​తో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి భేటీ

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం కసరత్తు జరుగుతున్న సమయంలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్​తో దిల్లీలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి భేటీ అయ్యారు. కాంగ్రెస్ వర్గాల్లో ఈ భేటీ చర్చనీయాంశంగా మారింది.

By

Published : Dec 16, 2020, 1:52 PM IST

Published : Dec 16, 2020, 1:52 PM IST

Updated : Dec 16, 2020, 1:58 PM IST

mp komtireddy venkatreddy meet with manickam tagore in delhi
మాణిక్కం ఠాగూర్​తో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి భేటీ

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్​ మాణిక్కం ఠాగూర్​తో... భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి భేటీ అయ్యారు. ఇప్పుడీ భేటీ కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పీసీసీ అధ్యక్షుడి ఎంపికకు కసరత్తు ముమ్మరమైన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. పీసీసీ కోసం పోటీ పడుతున్న వారిలో కోమటిరెడ్డి కూడా ఉన్నారు.

ప్రధానంగా పోటీలో ఉన్న రేవంత్​ రెడ్డి కూడా ఈరోజే దిల్లీ వెళ్లారు. పదవి కోసం ఎవరికివారు తీవ్రంగా లాబీయింగ్​ చేస్తున్నారు. ఇంకో నలుగురైదురుగు పోటీలో ఉన్నప్పటికీ... వీరిద్దరిలో ఎవరో ఒకరిని ఎంపిక చేయనున్నట్టు తాజా పరిణామాలను చూస్తే అర్థమవుతోంది.

ఇదీ చూడండి:పోలీస్​శాఖలో 20వేల పోస్టులు భర్తీ చేస్తాం: హోంమంత్రి

Last Updated : Dec 16, 2020, 1:58 PM IST

ABOUT THE AUTHOR

...view details