ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రాజీవ్.. సహర్ష (12).. వరసకు మేనమామ, మేనల్లుళ్లు. ఈ ఇద్దరూ ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితి తెలిస్తే.. ఎంతటి కర్కశులైనా చలించిపోతారు. అయ్యో పాపం.. అనక మానరు. కరోనా సృష్టించిన కల్లోలం.. ఈ కుటుంబాన్ని కకావికలం చేసిన తీరుకు.. ఎవరైనా సరే.. ఆవేదన చెందుతారు. తల్లిదండ్రులు ఇక లేరన్న విషయం తెలియని ఆ 12 ఏళ్ల బాలుడు.. మామూలుగానే ఎదురుచూపులతో కాలం వెళ్లదీస్తుంటే.. ఆ విషయం చెప్పలేక అతని మేనమామ రాజీవ్ నరకయాతన అనుభవిస్తున్నారు. కరోనా వల్ల తల్లిదండ్రులనూ కోల్పోయిన రాజేశ్ ఆ విషయాన్ని కూడా.. సహర్షకు చెప్పలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తోడబుట్టిన ఆడబిడ్డ కుటుంబంతో పాటు.. తల్లిదండ్రులనూ కోల్పోయి.. మేనల్లుడి కోసం శోకాన్ని దిగమింగుతున్నారు.
అసలేం జరిగింది...
రాజోలు సమీపంలోని శివకోడు గ్రామానికి చెందిన సివిల్ కాంట్రాక్టర్ మేడిచర్ల వి.సుధీర్రాయ్ (45), ఆయన భార్య శ్వేత హరిత (36), తల్లి ఉమామహేశ్వరి (74), కుమారుడు సాయి సత్య సహర్షతో కలిసి ఉంటున్నారు. సుధీర్రాయ్ దంపతులకు ఏప్రిల్లో కరోనా సోకింది. శ్వేత హరిత సోదరుడు బండారు రాజీవ్ వచ్చి వారిని ఆసుపత్రిలో చేర్చాడు. అల్లుడైన 12ఏళ్ల సాయిసత్య సహర్షను చూసుకుంటూ వారింటి వద్దే ఉంటున్నాడు. ఏప్రిల్ 25న సుధీర్రాయ్, మే 9న శ్వేతహరిత, మే 4న ఉమామహేశ్వరి మృతిచెందారు. రాజీవ్ ఈ విషయం సహర్షకు చెప్పకుండా ఆసుపత్రిలో ఉన్నారంటూ దాటవేస్తూ వస్తున్నారు.
ఇంతలో మరో విషాదం...