తెలంగాణ

telangana

By

Published : Nov 24, 2020, 7:46 PM IST

ETV Bharat / city

ఎంఐఎం విస్తృత ప్రచారం... మరోసారి ఆశీర్వదించాలని వినతి

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం ప్రచార జోరు పెంచింది. స్వయంగా కార్యక్షేత్రంలోకి దిగిన ఆ పార్టీ అధినేత, పార్లమెంట్‌ సభ్యుడు అసదుద్దీన్‌ ఓవైసీ పాతబస్తీలో పాదయాత్ర నిర్వహించారు.

ఎంఐఎం విస్తృత ప్రచారం... మరోసారి ఆశీర్వదించాలని వినతి
ఎంఐఎం విస్తృత ప్రచారం... మరోసారి ఆశీర్వదించాలని వినతి

ఎంఐఎం విస్తృత ప్రచారం... మరోసారి ఆశీర్వదించాలని వినతి

హైదరాబాద్​లోని​ చార్మినార్‌ నియోజకవర్గంలో ఎంఐఎం విస్తృత ప్రచారం నిర్వహించింది. ప్రచారంలో పాల్గొన్న ఎంపీ అసదుద్దీన్​ ఓవైసీ... ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిశారు.

ఖిల్వత్‌, లింబువాలి మజీద్‌, మహ్మదీయ వైద్య కళాశాల, ఓవైసీ నగర్‌, షా గంజ్‌, ఘాన్సీబజార్‌లో ఇంటింటికి వెళ్లి ఎంఐఎంను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. పతంగి గుర్తుకే పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. వరద బాధితులందరికీ సాయమందేలా చేయడంతో పాటు డివిజన్లలో అభివృద్ధికి కృషిచేస్తామని అసదుద్దీన్‌ హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: భాజపా నేతలు హైదరాబాద్‌లో చిచ్చుపెట్టాలనుకుంటున్నారా..?

ABOUT THE AUTHOR

...view details