తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రకటనలతో ప్రభుత్వం మభ్యపెడుతోంది: రామచందర్​ రావు - ప్రభుత్వ ప్రకటనలపై ఎమ్మెల్సీ రామచందర్ రావు ఆగ్రహం

ప్రకటనలతో రాష్ట్ర ప్రభుత్వం... ఉద్యోగులను, నిరుద్యోగులను మభ్యపెడుతోందని ఎమ్మెల్సీ రామచందర్​ రావు విమర్శించారు. విద్యాశాఖలోని అధికారుల పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయని ఆరోపించారు.

mlc ramchandar rao fire on government statements about employes and unemployes
ప్రకటనలతో ప్రభుత్వం మభ్యపెడుతోంది: రామచందర్​ రావు

By

Published : Dec 30, 2020, 12:30 PM IST

ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలతో మభ్యపెడుతోందని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు విమర్శించారు. ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకుండా కేవలం శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో లబ్ది పొందేందుకు తెరాస ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

ఉద్యోగుల డిమాండ్లేవీ ప్రభుత్వం నెరవేర్చడం లేదన్న రాంచందర్‌రావు... విద్యాశాఖలో అధికారుల పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయని ఆరోపించారు. మండల, జిల్లా విద్యాధికారులు లేకుండా విద్యా వ్యవస్థ ఎలా నడుస్తుందని ప్రశ్నించారు.

ప్రకటనలతో ప్రభుత్వం మభ్యపెడుతోంది: రామచందర్​ రావు

ఇదీ చూడండి:'చైనాతో చర్చల్లో అర్థవంతమైన ఫలితం రాలేదు'

ABOUT THE AUTHOR

...view details