తెలంగాణ

telangana

By

Published : Sep 24, 2020, 7:30 AM IST

ETV Bharat / city

వీధి వ్యాపారులకు రుణాలు మంజూరుచేసిన ఎమ్మెల్యే వివేకానంద

పీఎం స్వనిధి పథకం కింద 596 మంది వీధి వ్యాపారులకు ఎమ్మెల్యే వివేకానంద రుణాలు మంజూరుచేశారు. రూ.10 వేల చొప్పున రూ.59.60 లక్షల రుణాలను అందించారు.

mla Vivekananda
వీధి వ్యాపారులకు రుణాలు మంజూరుచేసిన ఎమ్మెల్యే వివేకానంద

జీహెచ్​ఎంసీ సర్కిల్​ పరిధిలో 596 మంది వీధి వ్యాపారులకు రూ.59.60 లక్షల రుణాలను మంజూరుచేశారు. పీఎం స్వనిధి పథకం కింద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద పాల్గొన్నారు. అర్హులైన వారికి రూ.10 వేల చొప్పున పంపిణీ చేశారు.

కరోనా ప్రభావంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీధి వ్యాపారులు, అసంఘటిత కార్మికులకు రుణాలు అందించడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. జంట సర్కిళ్ల పరిధిలో సుమారు 13 వేల మంది వీధి వ్యాపారులకు రుణాలు అందించవచ్చని అధికారులు.. ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే వారందరికి రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు మంగతాయారు, రవీందర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

ఇవీచూడండి:కొత్త రెవెన్యూ చట్టం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు రక్షణ: సీఎం

ABOUT THE AUTHOR

...view details