తెలంగాణ

telangana

ETV Bharat / city

కాలనీల్లో రసాయన ద్రావణంతో ఎమ్మెల్యే పిచికారి - kukatpally mla news

కూకట్​పల్లి ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. నియోజకవర్గంలోని బాలాజీ నగర్​ డివిజన్​లో తానే స్వయంగా రసాయనాన్ని చల్లారు.

MLA SPRAY  CHEMICAL in colony's
రసాయనాన్ని పిచికారి చేసిన ఎమ్మెల్యే

By

Published : Apr 1, 2020, 9:51 AM IST

కూకట్​పల్లి నియోజకవర్గంలోని బాలాజీ నగర్ డివిజన్​లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. కాలనీవాసులతో మాట్లాడి కనీస శుభ్రత పాటించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని అన్ని కాలనీల్లో రసాయనాన్ని పిచికారి చేశామన్నారు. ఇంకా ఏ ప్రాంతంలోనైనా స్ప్రే చేయని పక్షంలో.. తనకు గానీ, పారిశుద్ధ్య సిబ్బందికి గానీ తెలియజేయాలని సూచించారు. నియోజకవర్గంలోని అన్ని ప్రధాన రహదారులతో పాటు.. కాలనీల్లో వైరస్ నిర్మూలనకు చర్యలు చేపట్టామని తెలిపారు.

రసాయనాన్ని పిచికారి చేసిన ఎమ్మెల్యే

ABOUT THE AUTHOR

...view details