గురునాథం కుటుంబసభ్యులను పరామర్శించిన సైదిరెడ్డి
విజయారెడ్డిని కాపాడేయత్నంలో ఆహుతై ఇవాళ మరణించిన డ్రైవర్ గురునాథం కటుంబ సభ్యులను ఎమ్మెల్యే సైదిరెడ్డి పరామర్శించారు. కుటుంబసభ్యులకు న్యాయం చేస్తానని వెల్లడించారు.
గురునాథం కుటుంబసభ్యులను పరామర్శించిన సైదిరెడ్డి
తహసీల్దార్ విజయారెడ్డి డ్రైవర్ గురునాథం కుటుంబసభ్యులను హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి పరామర్శించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా... అక్కడ ఆయన కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సైదిరెడ్డి పరామర్శించారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తానని తెలిపారు.