రామమందిర నిర్మాణం కోసం విరాళాలు సేకరిస్తున్న వారిపై దిల్లీలో దాడులు జరుగుతున్నాయని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. నిందితులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. దాడులు జరుగుతుంటే కేజ్రీవాల్ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.
'దిల్లీలో హిందువులపై దాడులు చేసిన వారిని అరెస్టు చేయాలి' - దిల్లిలో హిందువులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
దిల్లీలో హిందువులు సురక్షితంగా ఉన్నారా అనే సందేహాం కలుగుతుందని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. హిందువులపై దాడులు జరుగుతుంటే కేజ్రీవాల్ ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు.
!['దిల్లీలో హిందువులపై దాడులు చేసిన వారిని అరెస్టు చేయాలి' 'దిల్లీలో హిందువులపై దాడులు చేసిన వారిని అరెస్టు చేయాలి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10602914-thumbnail-3x2-rajasingh.jpg)
'దిల్లీలో హిందువులపై దాడులు చేసిన వారిని అరెస్టు చేయాలి'
మైనార్టీలకు అనుకూలంగా అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారని మండిపడ్డారు. రింక్శర్మపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డుకు కేంద్రం ఆమోదం: నామ