తెలంగాణ

telangana

ఫిలింనగర్​లో రామాలయానికి ఎమ్మెల్యే రాజాసింగ్​ శంకుస్థాపన

హైదరాబాద్​ ఫిలింనగర్​లోని వినాయక నగర్​లో నిర్మించనున్న రామాలయం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. జూబ్లీహిల్స్ డివిజన్ భాజపా నేత పల్లపు గోవర్ధన్​ సొంత నిధులతో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ ముఖ్య అతిధిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు.

By

Published : Aug 5, 2020, 3:43 PM IST

Published : Aug 5, 2020, 3:43 PM IST

ఫిలింనగర్​లో రామాలయానికి ఎమ్మెల్యే రాజాసింగ్​ శంకుస్థాపన
ఫిలింనగర్​లో రామాలయానికి ఎమ్మెల్యే రాజాసింగ్​ శంకుస్థాపన ఫిలింనగర్​లో రామాలయానికి ఎమ్మెల్యే రాజాసింగ్​ శంకుస్థాపన

అయోధ్యలో రామమందిరానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తున్న సమయంలోనే ఫిలింనగర్​లో రామాలయం శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉందని గోషామహల్ ఎంఎల్ఏ రాజా సింగ్ అన్నారు. జూబ్లీహిల్స్ డివిజన్ భాజపా నేత పల్లపు గోవర్ధన్​ సొంత నిధులతో వినాయక నగర్​లో నిర్మించనున్న రామాలయానికి.. శంకుస్థాపన పూజల్లో రాజాసింగ్​ పాల్గొన్నారు. వేద పండితులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శంకుస్థాపన కార్యక్రమంలో బస్తీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఖైరతాబాద్ నియోజక వర్గానికే తలమానికంగా రామాలయాన్ని తీర్చిదిద్దుతామని గోవర్ధన్​ అన్నారు.

ఫిలింనగర్​లో రామాలయానికి ఎమ్మెల్యే రాజాసింగ్​ శంకుస్థాపన

ABOUT THE AUTHOR

...view details