తెలంగాణ

telangana

By

Published : Jan 25, 2021, 8:27 PM IST

ETV Bharat / city

రామతీర్థంలో కొత్త విగ్రహాల ప్రతిష్ఠాపన: వెల్లంపల్లి శ్రీనివాసరావు

ఏపీలోని విజయనగరం జిల్లా రామతీర్థంలో జనవరి 28న సీతారామ లక్ష్మణుల కొత్త విగ్రహాలు ప్రతిష్ఠించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. సోమవారం నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయని తెలిపారు.

ap minister vellampalli srinivasa rao
రామతీర్థంలో కొత్త విగ్రహాల ప్రతిష్ఠాపన : వెల్లంపల్లి శ్రీనివాసరావు

ఏపీలోని విజయనగరం జిల్లా రామతీర్థంలో జనవరి 28న బాలాలయంలో సీతారామ లక్ష్మణుల విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమం చేయనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. తితిదేకి చెందిన నిష్ణాతులైన శిల్పులతో కృష్ణశీల రాతితో విగ్రహాలను తయారు చేయించామన్నారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో తయారు చేయించిన విగ్రహాలను ఇప్పటికే రామతీర్థానికి తరలించామని వెల్లంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు.

ధాన్యంతో నింపిన ప్రత్యేక పాత్రల్లో ప్రధానాలయంలోని హోమశాలలో వాటిని భద్రపరిచినట్లు మంత్రి తెలిపారు. రామతీర్థం కొండ దిగువన ఉన్న బాలాలయంలో 28వ తేదీన విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమం చేపడుతామని మంత్రి వెల్లడించారు. సోమవారం నుంచే స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు.

ఇదీ చదవండి:ఎన్​సీడీసీకి స్థలం కేటాయించాలని కేసీఆర్​కు కిషన్ రెడ్డి లేఖ

ABOUT THE AUTHOR

...view details