తెలంగాణ

telangana

ETV Bharat / city

గిరిజన ప్రాంతాల అధికారులూ అప్రమత్తంగా ఉండండి: సత్యవతి రాఠోడ్ - అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి సత్యవతి రాఠోడ్ సూచన

గిరిజిన ప్రాంతాల, ఐటీడీఏ ప్రాజెక్టుల అధికారులు అప్రమత్తంగా ఉండాలని... గిరిజిన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ అన్నారు. ఈ మేరకు అధికారులతో ఫోన్​లో మాట్లాడి... ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులపై ఆరా తీశారు.

minister sathyavathi ratode review on tribal and itda areas
గిరిజన ప్రాంతాల అధికారులూ అప్రమత్తంగా ఉండండి: సత్యవతి రాఠోడ్

By

Published : Oct 14, 2020, 5:51 PM IST

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గిరిజన, ఐటిడిఏ ప్రాంతాల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ ఆదేశించారు. ఈ మేరకు పరిస్థితిపై అధికారులతో ఫోన్​లో ఆరా తీశారు. వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగుతున్నాయని నీట మునిగిన లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.

మరో రెండు రోజుల పాటు వర్షం వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినందున... ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, గిరిజన ప్రాంతాల కలెక్టర్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని, 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. వరదల్లో, వాగుల్లో ప్రజలు ప్రమాదంలో పడకుండా తగిన హెచ్చరికలు చేయాలని, ఏదైనా అత్యవసరం ఏర్పడితే తాను 24 గంటలు అందుబాటులో ఉంటానని వెంటనే సమాచారం అందించాలన్నారు.

ఇదీ చూడండి:జీహెచ్​ఎంసీ అధికారుల తీరుపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details