తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనాపై మంత్రి సబితారెడ్డి ఉన్నతస్థాయి సమావేశం - Minister Sabitha Reddy Review Meeting On Lock Down Participation OF People

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు పాటిస్తున్న లాక్​డౌన్ రంగారెడ్డి జిల్లాలో ఏ విధంగా జరుగుతుందో మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టరేట్ ఆఫీసులో ఉన్నతస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు.

Minister Sabitha Reddy Review Meeting On Lock Down Participation OF People
కరోనాపై మంత్రి సబితారెడ్డి ఉన్నతస్థాయి సమావేశం

By

Published : Mar 26, 2020, 8:35 PM IST

కరోనాపై మంత్రి సబితారెడ్డి ఉన్నతస్థాయి సమావేశం

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్​ను అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్​డౌన్ సమయంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చేస్తున్న పలు ఏర్పాట్లపై ఆమె సమీక్షించారు.

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్లు హరీష్, ప్రతీక్ జైన్​లు, ఇతర శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అత్యవసర సేవలు, ప్రజలకు అవసరమయ్యే నిత్యావసరాలు, ఉచిత బియ్యం పంపిణీ, పారిశుద్ధ్యం, మాస్కులు, శానిటైజేషన్ నిర్వహణ తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

లాక్​డౌన్ సమయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా 12 కిలోల ఉచిత బియ్యం, రూ. 1500 ఇస్తున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు జిల్లాలో 8 పాజిటివ్ కేసులు నమోదైనట్టు ప్రకటించారు. గచ్చిబౌలి క్వారంటైన్ కేంద్రంలో 57 మంది, రాజేంద్రనగర్​లో 64మంది క్వారంటైన్​లో ఉన్నారని తెలిపారు. ప్రజలెవ్వరూ రోడ్లపైకి రావొద్దని, వైరస్ తీవ్రత తగ్గాలంటే ప్రతీ ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు.

ఇదీ చూడండి:పత్రికల ద్వారా కరోనా సోకదు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details