తెలంగాణ

telangana

ETV Bharat / city

అన్ని ఆస్పత్రుల్లో కొవిడేతర సేవలు ప్రారంభించండి: ఈటల

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడేతర సేవలను ప్రారంభించాలని మంత్రి ఈటల రాజేందర్​ వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం బీఆర్కే భవన్​లో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలో కొవిడ్ కేసుల పరిస్థితిపై ఆరా తీశారు. ఆక్సీజన్ పడకల అందుబాటు సహా ఆస్పత్రుల్లో పరిస్థితులను సమీక్షించారు.

By

Published : Sep 30, 2020, 5:40 AM IST

'అన్ని ఆస్పత్రుల్లో నాన్ కొవిడ్ సేవలు ప్రారంభించాలి'
'అన్ని ఆస్పత్రుల్లో నాన్ కొవిడ్ సేవలు ప్రారంభించాలి'

గాంధీ సహా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడేతర సేవలను ప్రారంభించాలని మంత్రి ఈటల రాజేందర్​ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఇటీవల జరిగిన వైద్య విద్య పీజీ పరీక్షలో పలువురు ఫెయిల్ అవ్వడంతో పాటు.. విద్యార్థుల నుంచి వినతులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మంగళవారం బీఆర్కే భవన్​లో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో కొవిడ్ కేసుల పరిస్థితిపై ఆరా తీశారు. ఆక్సీజన్ పడకల అందుబాటు సహా ఆస్పత్రుల్లో పరిస్థితులను సమీక్షించారు. కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికిీ.. ప్రజలు మాత్రం సామాజిక దూరం, మాస్క్‌లు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇవీ చూడండి:మహిళలు, బాలికల రక్షణలో ప్రభుత్వం విఫలమైంది: సీతక్క

ABOUT THE AUTHOR

...view details